నవల అనగానే కొత్త అంశం ఉంటుందనే భావన కలుగుతుంది. ద్రౌపదిని గురించి తెలియని తెలుగు వారుండరు. అలాంటప్పుడు ద్రౌపది గురించి చెప్పడాని కొత్తదనం ఏముంది? ఏముంటుంది? అనే ప్రశ్నలు పుడతాయి.
భారతంలో ఏదైనా ఒక పాత్ర గురించి పూర్వాపరాలు తెలుసుకోవాలి.అప్పుడే సరైన విషయావహగాహన వస్తుంది. ద్రౌపది గురించి తెలుసుకోవాలన్నప్పుడు మూలభారతంలో ఏముంది ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకోడం అవసరం. ఇంకో విషయం ఏమిటంటే భారతం పుట్టి చాలా సంత్సరాలు అయినా వ్యాసభారతం పూర్తిగా ఆధునిక లేక వ్యహరిక తెలుగులోకి రాకపోవడం శోచనీయం . నీలకంఠ మొదలైన వారి వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే శలాక రఘునాధ శర్మ గారు మొదలైన వారు వ్యాఖ్యలు రాయడం జరుగుతోంది.
భారతాన్ని చదవని పండితుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఇక రామలక్ష్మి గారు మంచి భారతం పై పట్టు ఉన్నవారే (ఆరుద్రగారి సహధర్మ చారిణి). నవలను ప్రారంభించడం లో జాగ్రత్త వహించారు.ఇంచుమించు కధ అంతా తెలిసిందే అయినా ఒక కొత్త కోణం ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. స్వర్గ లోకానికి ప్రయాణంతో కథ మొదలౌతుంది.
ముందుగా ద్రౌపది తూలి పడి పోతుంది. అది గమనించిన భీమడు ధర్మరాజుతో "అన్నా! ద్రౌపది ఎందుకిలా పడిపోయింది కారణం ఏమని" అడుగుతాడు. ఆమెకు అర్జునుడిమీద ఎక్కువ ప్రేమే కారణంగా సమాధానం చెప్తాడు. తర్వాత సహదేవుడు నేలకొరిగాడు దానికి కారణం ఇతనికి తనకంటే ప్రాజ్ఞుడు లోకంలో లేడనీ గర్వం కారణంగో చెపతాడు. నకులుడు నేలకొరిగాడు "తనకంటే అందగాడు, రూపాతిశయం ఉందనే అహం కలవాడని అంటాడు.ద్రౌపదితో పాటు తమ్ములు నేలకు ఒరగడంవల్ల కలిగిన బాధతో అర్జునుడు నేలకొరిగిపోతాడు. "కారణం అతడు కౌరవులనందరనీ ఒక్కరోజులో యుద్ధరంగంలో తెగటారుస్తానని అలా చేయలేకపోతాడు. ఎందరినో కోదండధారులను నిర్లక్ష్యంగా చూస్తాడు. అందుకే ఇలా జరిగిందని" ధర్మరాజు చెప్తాడు.
ఏదొక లత తగిలనట్లు భీమడూ నేలకొరిగాడు. "భోజనప్రియుడు, ప్రచండ బలాఢ్యుడై ఎవ్వరినీ లెక్క చేయక ప్రగల్భాలు తరచు పలుకుతూ ఉండడం" వల్ల తనువు చాలించాడు. చివరకు ఒక కుక్క మాత్రమే ధర్మరాజు వెంట వస్తుంది.ఆ కుక్కని విడిచి పెట్టి ఇంద్రలోకానికి రమ్మని ఇంద్రుడు ఆహ్వానిస్తాడు.ఇంతవరకూ తనను నమ్మి వచ్చిన కుక్కను వదలి రానంటాదు. చివరకు ధర్మరాజుయొక్క సత్య సంధతకు మెచ్చి కుక్కె దర్మ దేవలా వచ్చిందని చెప్తాడు.
దేవతల రాజు ఇంద్రుడు వచ్చి ధర్మరాజుని ఇంద్రలోకం రమ్మని ఆహ్వానిస్తాడు. దేవలోకంలో ముందుగా కర్ణుడు కనిపిస్తాడు. అన్ని విషయాలు గురుకు వచ్చి ఇంద్రునిడిని అడుగుతాడు. ఒకొక్కరి విషయాలు ఇంద్రుడు వివరిస్తాడు. సీతదేవిగా, ఇంద్రసేనగా ,అపరలక్ష్మి గా, ద్రౌపదిని వివరిస్తాడు.ఇక్కడ వ్యాసభారతంలో ఇన్ని కథలు లేవు.సీత విషయం అందులో లేదు.రచయిత్రి సృష్టి మాత్రమే.
తరువాత అంశాలతో మరోసారి. సరేనా..
Tuesday, December 4, 2007
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment